వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉండగా.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

