వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని శరవణ సుప్రభాత్ హోటల్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. టిఫిన్ తయారు చేస్తుండగా సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Comments
Loading comments...

