Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లో చోరీ.. 64 గ్రాముల బంగారం మాయం

Follow Udayam Digital on Google
శివ కుమార్ Jul 28, 2026 11:10 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఇంట్లో చోరీ.. 64 గ్రాముల బంగారం మాయం - Udayam Digital
విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో 64 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీకి గురయ్యాయి. ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లిన యజమాని తిరిగి వచ్చేసరికి గడియ పగులగొట్టి బీరువా తెరిచి ఉన్నట్లు గుర్తించారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...