వార్తలకు తిరిగి వెళ్లండి

హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకుడు యు. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలో వినతిపత్రం ఇచ్చారు. హెల్త్ కార్డులు, 55 ఏళ్లు నిండిన వారికి ₹6,000 పింఛను, ఇందిరమ్మ ఇళ్లు, మృతుల కుటుంబాలకు ₹25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. నాయకులు చుక్క కుమార్, రాజయ్య పాల్గొన్నారు.
Comments
Loading comments...

