Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HM ఫోన్ హ్యాక్.. ఖాతా నుంచి నగదు మాయం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 13, 2026 2:12 PM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
HM ఫోన్ హ్యాక్.. ఖాతా నుంచి నగదు మాయం - Udayam
గోరంట్ల మండలంలోని కలిగెరి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం మురళి సైబర్ మోసానికి గురయ్యారు. సైబర్ నేరగాళ్లు ఆయన ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.35 లక్షలు కాజేశారు. బ్యాంకును సంప్రదించగా రూ.85 వేలు ఒక బ్యాంకుకు, రూ.50 వేలు మరో బ్యాంకుకు బదిలీ అయినట్లు తేలింది. దీంతో మురళి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...