వార్తలకు తిరిగి వెళ్లండి

సంఘటిత పోరాటాలతో హక్కులను సాధించుకోవాలని నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జంపాల రవీందర్ అన్నారు. ములుగులో ఈ నెల 15న నిర్వహించనున్న జిల్లా మహాసభ గోడపత్రికలను వెంకటాపురంలో విడుదల చేశారు.
నాయీబ్రాహ్మణులు సంఘటితంగా కొనసాగాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. సామాజిక రంగాల్లో తమ వాటా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

