Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్‌మాస్టర్ హత్యకు నిరసనగా శాతవాహన వర్సిటీలో విద్యార్థుల ర్యాలీ

Follow Udayam on Google
sudheer Aug 22, 2026 10:24 PM కరీంనగర్General
హెడ్‌మాస్టర్ హత్యకు నిరసనగా శాతవాహన వర్సిటీలో విద్యార్థుల ర్యాలీ - Udayam
నల్గొండ నాగార్జున పాఠశాల హెడ్‌మాస్టర్ దారుణ హత్యను ఖండిస్తూ కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో శనివారం సాయంత్రం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ నేత శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విద్యాసంస్థల్లో విపరీత ధోరణులపై ఆందోళన వ్యక్తంచేస్తూ, పిల్లలలో నైతిక విలువల పెంపునకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...