Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ తరహాలో ఆందోళనలు చేస్తాం: హరీష్‌రావు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 2:21 PM హైదరాబాద్తెలంగాణ
జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న 6 వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీమా సౌకర్యం లేక ఇద్దరు సర్వేయర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఢిల్లీ తరహాలో ఆందోళనలు చేస్తామని, అసెంబ్లీలో సమస్యను ప్రస్తావిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...