వార్తలకు తిరిగి వెళ్లండి
హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి

మంచిర్యాల జిల్లాలోని అన్ని హాస్టల్లో ఉండే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యురాలు పోతు విజయశంకర్ కోరారు. ఆదివారం లక్షెట్టిపేటలో ఆమె మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా హాస్టల్లో ఉండే విద్యార్థులు జ్వరాలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రతివారం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Loading comments...