వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని శ్రీ గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఉన్న యజ్ఞశాలలో 117 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాయి. శ్రావణమాసం ఆదివారం సందర్భంగా పలు ప్రాంతాల నుండి భక్తులు దేవాలయానికి తరలివచ్చి శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేయించారు.
ఈ సందర్భంగా వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సెప్టెంబర్ 1 నుండి 3 వరకు స్వామివారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
Comments
Loading comments...

