వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లాలోని రైతులకు పంట ఉత్పత్తుల రవాణా కష్టాలు తీరనున్నాయి. వీబీజీ రామ్జీ పథకం కింద 234 పంచాయతీల్లోని 1,273 డొంక రోడ్లను బాగుచేసేందుకు ఆర్ అండ్ బి అధికారులు ప్రభుత్వానికి రూట్ మ్యాప్ పంపారు.
గతంలో రోడ్లు సరిగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా, ప్రస్తుతం ఉపాధి హామీ నిధులతో 1,655 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు మరింత సులభతరం కానుంది.
Comments
Loading comments...

