వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోనూ తమకు పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం గుంటూరు కలెక్టరేట్ ముట్టడించి వీఆర్ఏలు భారీ ధర్నా నిర్వహించారు.
వీఆర్ఏ నాయకులు మాట్లాడుతూ... సర్వీసులో ఉంటూ మరణించిన వీఆర్ఏల కుటుంబాల్లోని ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

