వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి నీరు నిలిచింది. దీంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నీటిలో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

