Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండ్లపల్లి–పొత్తూరు డబుల్‌ రోడ్డు నిర్మించాలి

Follow Udayam on Google
sudheer Aug 31, 2026 4:07 PM కరీంనగర్General
గుండ్లపల్లి–పొత్తూరు డబుల్‌ రోడ్డు నిర్మించాలి - Udayam
గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి–పొత్తూరు అధ్వాన రహదారి సమస్య తీర్చి, వెంటనే డబుల్‌ రోడ్డు నిర్మించాలని జనసేన కరీంనగర్‌ పార్లమెంట్ కోఆర్డినేటర్ డా. బండారి రాజ్‌కుమార్‌ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. గోతుల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్థులు నరకం చూస్తున్నారన్నారు. పనులు ప్రారంభించేవరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...