వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడి తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. అజంగఢ్కు చెందిన ప్రయాణికుడు ఎయిరిండియా విమానంలో ముంబయికి వెళ్లేందుకు వచ్చాడు.
తనిఖీల సమయంలో తుపాకీని అధికారులకు ఇస్తుండగా పేలినట్లు సమాచారం. తూటాలు నేలకు తాకి దూసుకెళ్లడంతో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

