వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలంలోని గులుమూరు గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి తాగునీటి సౌకర్యం లేకపోవడంతో సుమారు అర కిలోమీటర్ దూరం వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహిళలు, వృద్ధులు, చిన్నారులు నిత్యం బిందెలు, పాత్రలతో నీటిని మోసుకొస్తున్నామని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

