వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సరిపడా గదులు లేక ఉపాధ్యాయులు విద్యార్థులకు గుడిలో పాఠాలు చెబుతున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో రెండు గదులు ఉన్నాయి. ఒక గది శిధిలావాస్తుకు చేరడంతో కూలిపోయింది.
ఉన్న ఒక్క గదిలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సరిపోవడం లేదు. దీంతో పక్కనే ఉన్న గుడిలో తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాల భవనాన్ని నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...

