వార్తలకు తిరిగి వెళ్లండి
పూరీలో వైభవంగా జగన్నాథుని బహుడా యాత్ర

పూరీ గుండిచా ఆలయ ఆవరణలో భక్తిశ్రద్ధలతో జగన్నాథుని తిరుగు (బహుడా) యాత్ర నయనానందకరంగా సాగింది. కీర్తనాచార్యుల నృత్యాలు, ఒడిస్సీ నాట్యాలు, భక్తుల జయజయధ్వానాలతో ప్రాంగణం మార్మోగింది.
తొలి యాత్రలో వర్షం వల్ల ఇబ్బందులు పడ్డ భక్తులు, బహుడా వేడుకల్లో మేఘావృతమైన అనుకూల వాతావరణంతో ఆనందించారు. వివిధ సేవా సంస్థలు భక్తులకు అన్నప్రసాదాలు, డల్మా, పాయసం, మజ్జిగ వంటి ఆహార పదార్థాలను పంపిణీ చేశాయి.
Comments
Loading comments...