వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానానికి వెళ్లే మార్గంలో ప్రకృతి ఒడిలో కనిపిస్తున్న గోవిందనామం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ సమీపంలోని కొండ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన మూడు భారీ రాళ్లపై శ్రీవారి తిరునామం ప్రతిరూపం కనిపిస్తోంది.
భక్తులు వాటికి ఎరుపు, తెలుపు రంగులు అద్ది పవిత్రంగా భావిస్తూ పూజలు చేస్తున్నారు.
Comments
Loading comments...

