Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పల్నాడులో గవర్నర్‌ పర్యటన

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 7:30 AM పల్నాడు General
నేడు పల్నాడులో గవర్నర్‌ పర్యటన - Udayam
రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు చిలకలూరిపేట మండలం బొప్పూడిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్కన కళ్యాణ మండపం నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు రూ.10.99 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు.

Comments

G
Loading comments...