వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అంగన్వాడీల విభాగం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.
మంత్రివర్గం వీరి నామినేషన్లకు ఆమోదం తెలిపింది. సిఫారసులను గవర్నర్కు పంపనున్నారు, ఆయన ఆమోదం అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Comments
Loading comments...

