వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని గోప్య తండా ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు నాగేశ్వర్, సీఏ వినోద్, సర్పంచ్ భర్త బుక్యా సంతోష్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పాఠశాలకు సహకారం అందిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

