వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం మండలంలో అర్హులైన వారు కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రాజ్ మనోహర్ సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారు సంబంధిత సచివాలయాల్లో పత్రాలు సమర్పించాలన్నారు.
దివ్యాంగులు 40 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా జత చేయాలని తెలిపారు. అర్హులైన వారు గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

