వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాజేడు మండలం పేరూరు వద్ద గురువారం రాత్రికి నీటిమట్టం 51.33 అడుగులకు చేరింది. వాగులు పొంగి నదిలో కలుస్తున్నాయి.
టేకులగూడెం సమీపంలో వరద నీరు రహదారిపైకి చేరడంతో హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

