వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం సమీపంలోని ఇసుక క్వారీల్లో గోదావరి వరద నీరు చేరడంతో 38 మంది చిక్కుకున్నారు. వీరిలో 30 మందికి పైగా లారీ డ్రైవర్లు, ఎనిమిది మంది స్థానికులు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు పడవలతో వారిని తరలించే చర్యలు చేపట్టారు. చర్ల-వెంకటాపురం మధ్య రాకపోకలు నిలిచిపోగా, భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Comments
Loading comments...
