వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వైరా మున్సిపాలిటీ ఒకటో వార్డు బీసీ కాలనీకి చెందిన కడారి రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు.
బైక్ పై వెళ్తున్న రాకేష్ ను కంటైనర్ ఢీకొట్టడంతో తల నుజ్జునుజ్జయి మృతిచెందాడు. వీ.ఎం.బంజర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

