వార్తలకు తిరిగి వెళ్లండి
యువతిపై కారులో గ్యాంగ్రేప్

మైసూరు జిల్లా టి.నరసిపుర తాలూకా ముగురు గ్రామం వద్ద పశ్చిమ బెంగాల్కు చెందిన ఒంటరి యువతిని కారులో అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రిహాన్ ఖాన్, కిశోర్ కుమార్, కిరణ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సంఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...