Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో వాటర్‌ పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన

శివ కుమార్ Jul 27, 2026 3:08 PM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్‌లో వాటర్‌ పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన - Udayam Digital
కరీంనగర్‌ 19వ డివిజన్‌ రేకుర్తిలో రూ.22 లక్షల వ్యయంతో చేపట్టనున్న వాటర్‌ పైప్‌లైన్‌ పనులకు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తాగునీటి సమస్య పరిష్కారానికి ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వాటర్‌ ట్యాంకు నుంచి పైప్‌లైన్‌ వేస్తున్నట్లు తెలిపారు. నగరంలో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...