Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లాట్ కొనుగోలు పేరుతో మోసం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 12, 2026 11:31 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఫ్లాట్ కొనుగోలు పేరుతో మోసం - Udayam
సత్యనారాయణపురంలో ఫ్లాట్ల కొనుగోలు పేరుతో రూ.8 లక్షలు తీసుకుని మోసం చేశారని పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. దేవీనగర్‌కు చెందిన కనకదుర్గ, ఆమె బంధువులు నిర్మాణంలో ఉన్న గ్రూప్‌ హౌస్‌లో ఫ్లాట్ల కోసం రూ.8 లక్షలు చెల్లించారు. తర్వాత ఫ్లాట్లకు ప్లాన్‌ లేదని, అవి వివాదంలో ఉన్నాయని తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...