వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో మద్యం తాగొద్దని చెప్పిన కొడుకు మధుకృష్ణను తండ్రి బాలమద్దిలేటి గొడ్డలితో నరికి హత్య చేశాడు. సోమవారం అర్ధరాత్రి నిద్రలో ఉన్న కుమారుడిపై దాడి చేసి పరారయ్యాడు.
మద్యం విషయంలో తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. అడ్డుకున్న భార్య, తల్లిపైనా దాడికి యత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

