వార్తలకు తిరిగి వెళ్లండి
కుమార్తె మృతిపై తండ్రి ఫిర్యాదు

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను అత్తింటివారే హత్య చేశారని తండ్రి హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైరెడ్డిపల్లె మండలంలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రాఘవ, బృంద మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త వేధింపుల అనంతరం బృంద మృతి చెందిందని తండ్రి ఆరోపించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...