Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు రుణమాఫీపై తుమ్మల కీలక ప్రకటన

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 6:25 PM హైదరాబాద్తెలంగాణ
రైతు రుణమాఫీపై తుమ్మల కీలక ప్రకటన - Udayam
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25,35,964 మంది రైతులకు ప్రయోజనం కల్పించామని చెప్పారు. ఇందుకోసం రూ.20,616.89 కోట్లు మాఫీ చేసినట్లు వెల్లడించారు. అర్హులైన రైతులకు ప్రయోజనం అందేలా ఇంటింటి ధ్రువీకరణ చేపట్టామని తెలిపారు. రుణమాఫీ వివరాలను నియోజకవర్గాలు, గ్రామాల వారీగా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...