Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్లలో కుటుంబమంతా మృతి

Follow Udayam on Google
కీర్తన్ Aug 16, 2026 3:40 PM వరంగల్తెలంగాణ
రెండేళ్లలో కుటుంబమంతా మృతి - Udayam
వరంగల్‌ మార్కెటింగ్‌ శాఖ అధికారి కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఏటూరునాగారం వైపు వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును ఇసుకలారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు ప్రాణాలు కోల్పోయారు. సురేఖ కుమారుడు సుక్రీత్‌ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో, భర్త కిరణ్‌ ఐదు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. ఇప్పుడు సురేఖ కూడా మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...