వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లాక్ పేపర్లను రసాయన ద్రావణంలో ముంచితే రూ.500 నోట్లుగా మారుతాయని నమ్మించి మోసాలకు పాల్పడిన వ్యక్తిని అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ.15 లక్షలు ఇస్తే కోటి రూపాయలు తయారు చేస్తానని చెప్పి బాధితుడి నుంచి రూ.13 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బ్లాక్ పేపర్లు, రసాయన ద్రావణాల సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...
