వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో ఓ కానిస్టేబుల్ సహకారంతో ఆరుగురు సభ్యులతో ఏర్పడిన నకిలీ ఐఏఎస్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఏఎస్ అధికారులమంటూ పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని బెదిరించి, ఫేక్ పోలీస్ వాహనంలో సూర్యాపేటకు తీసుకెళ్లి రూ.6.26 లక్షల నగదు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.
Comments
Loading comments...

