Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ డీఏపీపై ఉక్కుపాదం: కలెక్టర్

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Aug 04, 2026 11:31 AM నాగర్ కర్నూల్తెలంగాణ
నకిలీ డీఏపీపై ఉక్కుపాదం: కలెక్టర్ - Udayam Digital
నాగర్‌కర్నూల్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువులపై ప్రత్యేక దాడుల్లో 872 బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. ఈ కేసులో 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 7 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. రైతులు లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే ఎరువులు కొనుగోలు చేసి బిల్లులు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...