వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగొండ కమలాపురం, భానాపురం, వనంవారి కృష్ణాపురం గ్రామాల్లోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను బుధవారం మండల వ్యవసాయ అధికారి సరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఏవో పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని స్పష్టం చేశారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా డీలర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Loading comments...

