వార్తలకు తిరిగి వెళ్లండి

మహనీయుల నిస్వార్థ పోరాటం, త్యాగాలతో దేశానికి స్వరాజ్యం సిద్ధించింది. మారుతున్న కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను సామాజిక రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం వేళ వీటిని వీడాలనే సంకల్పం అవసరం కావాలి.
బాలికలపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఏటా సుమారు 90 పోక్సో కేసులు నమోదవుతున్నాయి. చిన్నారుల స్వేచ్ఛను హరిస్తున్న ఈ పరిస్థితి మారాల్సిన అవసరముంది.
Comments
Loading comments...

