Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు ఎరువుల విక్రయం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 23, 2026 8:03 PM ఆదిలాబాద్General
ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు ఎరువుల విక్రయం - Udayam
ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు 28-28-0 ఎరువులు విక్రయించిన ఉట్నూరులోని శ్రీనివాస ఫర్టిలైజర్స్‌ లైసెన్స్‌ను వ్యవసాయశాఖ అధికారులు 15 రోజులపాటు సస్పెండ్‌ చేశారు. కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశాలతో తనిఖీలు నిర్వహించి నిబంధనల ఉల్లంఘనను నిర్ధారించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఫిర్యాదులకు 8977742855కు సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...