Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో నీటి సంక్షోభం: కలెక్టర్

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 9:19 PM జగిత్యాలతెలంగాణ
ఎల్‌నినో ప్రభావంతో నీటి సంక్షోభం: కలెక్టర్ - Udayam
ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు కొత్తగా వరినాట్లు వేయడం, వరి సాగు విస్తీర్ణం పెంచడం నివారించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగు చేసే కందులు, పెసర, మినుములు, ఆముదం, జొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...