Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగుల గుంపుతో గ్రామాల్లో టెన్షన్‌

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 2:53 PM పార్వతీపురం మన్యంGeneral
ఏనుగుల గుంపుతో గ్రామాల్లో టెన్షన్‌ - Udayam
కొమరాడ మండలం కళ్లికోట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారులు గురువారం తెలిపారు. సమీప కొండ ప్రాంతంలో ఏనుగులు ఉండటంతో పరిసర గ్రామాల ప్రజలు అటువైపు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలు పాటిస్తూ ఏనుగులకు దూరంగా ఉండాలని సూచించారు. అడవి ఏనుగులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...