Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నబిడ్డల నిర్లక్ష్యంపై వృద్ధురాలి ఫిర్యాదు

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Aug 04, 2026 11:59 AM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
కన్నబిడ్డల నిర్లక్ష్యంపై వృద్ధురాలి ఫిర్యాదు - Udayam Digital
కన్నబిడ్డలు పట్టించుకోవడం లేదంటూ వృద్ధురాలు నర్సమ్మ ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుకు ఫిర్యాదు చేసింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. చల్లపల్లికి చెందిన నర్సమ్మ తన కుమారులు ఆదరించడం లేదని, అడిగితే బెదిరిస్తున్నారని తెలిపింది. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...