Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడపల్లిలో విషాదం.. పాముకాటుతో వ్యక్తి మృతి

Follow Udayam on Google
raju Aug 25, 2026 3:05 PM నిజామాబాద్General
ఎడపల్లిలో విషాదం.. పాముకాటుతో వ్యక్తి మృతి - Udayam
ఎడపల్లిలోని అంబెంలో విషాదం నెలకొంది. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని పాము కాటు వేయగా చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడు. అంబెం గ్రామంలో సోమవారం తన ఇంట్లో గంగాకిషన్ నిద్రించగా.. ఇంట్లోకి ప్రవేశించిన పాము అతడికి కాటు వేసింది.వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ అతడు మంగళవారం మృతి చెందాడు. గంగాకిషన్ మృతితో అంబెం గ్రామంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...