వార్తలకు తిరిగి వెళ్లండి
పశ్చిమ నేపాల్లో రిక్టర్ స్కేలుపై 4.2తో భూకంపం

బుధవారం తెల్లవారుజామున పశ్చిమ నేపాల్లోని బజాంగ్ జిల్లా కోట్దేవాల్ కేంద్రంగా 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 4:40 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప పర్యవేక్షణ కేంద్రం వెల్లడించింది.
గత వారంలోనూ రుకుమ్ ఈస్ట్ జిల్లాలో 5 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.
Comments
Loading comments...