వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 79 మండలాలకుగాను 69 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవుతోంది. 15 మండలాల్లో తీవ్ర లోటు ఉండగా, పంటల సాగుపై ప్రభావం పడుతోంది.
దశాబ్దం తర్వాత ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. దేవాదుల, ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటి సరఫరాపై ఆశలు పెట్టుకున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగును సూచిస్తున్నారు.
Comments
Loading comments...
