Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 4:36 PM కరీంనగర్తెలంగాణ
నగరంలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన - Udayam
నగరంలోని 3వ డివిజన్‌ విద్యారణ్యపురిలో డ్రైనేజీ, 23వ డివిజన్‌ బాలాజీనగర్‌లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ శంకుస్థాపన చేశారు. మున్సిపల్‌ సాధారణ నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. మేయర్‌ అధికారులను నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సాదినేని లావణ్య, మునిందర్‌, గుమ్మడి రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...