వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.
పర్యాటక ప్రాంతాలు, డ్యామ్లను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. ఉద్ధృతంగా ప్రవహించే వాగులు, కల్వర్టులు దాటవద్దని, అత్యవసర పరిస్థితుల్లో డయల్-100ను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

