వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలోని రంగనాయకుల గుట్టలో కుక్క ఆటో వద్ద మూత్ర విసర్జన చేయడంతో శ్రీనాథ్(23) మరియు మధు మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు.
ఈ క్రమంలో మధు ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి శ్రీనాథ్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

