Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల గైర్హాజరు

రాజిత దేవి Jul 27, 2026 5:29 PM కామరెడ్డితెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల గైర్హాజరు - Udayam Digital
జిల్లాలోని పలు ప్రభుత్వ పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో ఆదివారం వైద్యులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడ్డారు. గాంధారి, బిచ్కుంద, మద్నూర్, రామారెడ్డి, నాగిరెడ్డిపేట్ కేంద్రాల్లో నర్సులే చికిత్స అందించారు. వైద్యుల గైర్హాజరుతో అత్యవసర రోగులను ఇతర ఆసుపత్రులకు పంపుతున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రతి కేంద్రంలో కనీసం ఒక వైద్యుడు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...