వార్తలకు తిరిగి వెళ్లండి
నోట్లో వజ్రం దాచి చోరీ యత్నం

సింగపూర్లోని ఒక నగల దుకాణంలో రూ. కోటిన్నర విలువైన వజ్రాన్ని నోట్లో పెట్టుకుని చోరీకి యత్నించిన ఇద్దరు భారతీయులు పట్టుబడ్డారు. నకిలీ వజ్రంతో దాన్ని మార్చి, విమానాశ్రయం నుంచి పారిపోయే లోపే పోలీసులు వారిని అరెస్టు చేశారు.
సీసీటీవీ ఆధారంగా నిందితులను పట్టుకుని వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరం నిరూపణ కావడంతో ఒకరికి రెండేళ్ల జైలు శిక్ష పడగా, మరొకరిపై విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...